
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్వర్శిటీ ప్రమాణ 2025 ఫెస్టివల్ఆదివారంతో ముగిసింది. రెండు రోజులుగా జరుగుతున్న సాంస్కృతికోత్సవాలు ఈడీఎం డీజే నైట్కార్యక్రమంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎస్పీ రూపేశ్, ఎస్వైఎన్వైసీఎస్ఫౌండర్ శ్రహంజ్హాజరయ్యారు. ఫైనల్డేలో భాగంగా స్టూడెంట్స్ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్లు, ఆటో ఎక్స్పో, బ్యాటిల్ఆఫ్ బ్యాండ్స్, ర్యాంప్వాక్, వెస్ర్టన్ డ్యాన్స్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రపంచ ప్రసిద్ధ జూలియా బ్లిస్, పీఆర్ వో బ్రదర్స్డీజే నైట్లో స్టూడెంట్స్ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతం వీసీ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్డీవీవీఎస్ఆర్ వర్మ, అడ్వైజర్త్రినాథరావు, స్టూడెంట్ లైఫ్ డైరెక్టర్రాహుల్మండల్ పాల్గొన్నారు.